సగ్గుబియ్యం దోశ
సగ్గుబియ్యం దోశ పిల్లలు ఇష్టపడతారు. వేడి వేడిగా చాలా బావుంటుంది.
కావలసినవి:
సగ్గుబియ్యం ఒక కప్పు
బియ్యం అర కప్పు
పచ్చిమిర్చి 2
అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
విధానం:
సగ్గుబియ్యం, బియ్యం కలిపి 6 గంటలు నానబెట్టండి. నీరు వంపేసి మిర్చి, అల్లం తో బాటు కలిపి పిండి పట్టండి. గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి నీళ్ళు కలుపుకోండి. ఈ పిండి పల్చగా ఉంటేనే బావుంటుంది. పెనం పై బయట నుండి లోపలికి (మైదా దోశెల్లగా) దోశెలుగా పొయ్యండి. రెండు వైపుల కాల్చి తీయండి.